'సై స్పోర్ట్స్' ఛానల్ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో 'సై స్పోర్ట్స్' పేరుతో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఛానల్ లోగోను ఆవిష్కరించారు. తెలుగులో స్పోర్ట్స్ కోసం ప్రత్యేక న్యూస్ ఛానల్ ను తీసుకరావడం పట్ల ఛానల్ యాజమాన్యంను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. క్రీడాకారులను, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లెజెండ్ నాగేశ్వరరావు, శివరాం ప్రసాద్, ఆనంద్ లు పాల్గొన్నారు.

More Press Releases