15న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెల‌వు: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

Related image

విజయవాడ: 75వ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉత్తర్వుల మేరకు 15వ తేదిన (ఆదివారం ) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. శనివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ మరియు చేపలను అమ్మిన యెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోనబడునని కమిషనర్ ఆదేశించారు. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు ఆదివారం అన్ని షాపులు ముసి వేయవలెనని ఆదేశించారు.

More Press Releases