ఆర్ఐడీఎఫ్ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని సమీక్షించిన తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన హై పవర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని ఆర్ఐడీఎఫ్ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని సమీక్షించారు. మంజూరు అయిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వై.కె.రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, నాబార్డ్ చే రాష్ట్రానికి మంజూరు చేసిన పనులు, విడుదల చేసిన నిధుల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. నాబార్డ్ విడుదల చేసిన మొత్తం నిధులను అన్ని విభాగాలు ఉత్పాదకంగా ఖర్చు చేయాలని మరియు ప్రాజెక్టుల పూర్తి నివేదికలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ మొదలైన శాఖలు చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలో ఇంటెన్సివ్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి సులభంగా ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాలను అన్వేషించాలని వ్యవసాయశాఖ కార్యదర్శిని కోరారు.

ఈ సమావేశంలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, ఆర్ధిక శాఖ ప్రత్యేక  కార్యదర్శి రోనాల్డ్ రోస్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ సయ్యద్ ఓమర్ జలీల్, టిఎస్ఈడబ్ల్యుఐడిసి, ఎండి, పార్థసారధి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.

వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని సమీక్షించిన సీఎస్:

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని బోధన మరియు జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్ మరియు ఐసియు పడకలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించుటకు ప్రత్యేక “మాప్ అప్ డ్రైవ్” నిర్వహించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేష్ రెడ్డి, టిఎస్ ఎమ్ ఐడిసి ఎం.డి చంద్ర శేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి సి.ఇ శ్యామ్ సుందర్, టిఎస్ ఎం ఐడిసి సి.ఇ రాజేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. 

More Press Releases