దిలీప్ కుమార్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు: సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నటుడుగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్ కుమార్ చేసిన సుధీర్ఘ సాంస్కృతిక సేవను సీఎం గుర్తు చేసుకున్నారు. దిలీప్ కుమార్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

More Press Releases