పౌల్ట్రీ, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్ను మిన‌హాయింపు: మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి ద‌యాక‌ర్ రావు
హైదరాబాద్: గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్‌లు, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్నును మిన‌హాస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని తెలిపారు. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా పౌల్ట్రీ య‌జ‌మానులు, డెయిరీ యూనిట్‌ల ఆస్తి ప‌న్నును ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నార‌ని ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు.

వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు, డెయిరీ యూనిట్ల వారు ఎంతో ల‌బ్ధి పొందుతార‌ని తెలిపారు. ఆస్తిపై హ‌క్కు పొంద‌డానికి సంవ‌త్స‌రానికి వంద రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఈ నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ద‌యాక‌ర్ రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ నిర్ణ‌యం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ రంగంలో కొత్త వారు రావ‌డానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

More Press Releases