టీ-శాట్ ఆవరణలో మొక్కలు నాటిన సీఈవో శైలేష్ రెడ్డి

Related image

(టీ-శాట్-సాఫ్ట్ నెట్): రైతు బాంధవుడు, ఉద్యమనేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీ-శాట్ కార్యాలయ ఆవరణలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మొక్కలు నాటారు. ప్రాణాలను ఫణంగా పోరాడి తెలంగాణ సాధించి, సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే నిత్య కృషీవలుడు చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే కోటి వృక్షార్చనలో భాగంగా సీఈవో మొక్కలు నాటారు. సీఎం జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను స్వీకరించాలని శైలేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది సైతం పాల్గొని మొక్కుల నాటి కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

More Press Releases