జైన్లు, మర్వాడీలు భారీగా వైసీపీలోకి చేరిక

Related image

  • వ్యాపార కూడ‌లిగా అభివృద్ది చేస్తాం: దేవ‌దాయ శాఖ మంత్రి
విజ‌య‌వాడ న‌గ‌రాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ది చేస్తామ‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. శ‌నివారం 37వ డివిజ‌న్ ర‌మ‌ణ‌య్య కూల్ డ్రింక్ షాప్ సెంట‌ర్ నుంచి ప‌లు ప్రాంతాలు మంత్రి వెల్లంపల్లి ప‌ర్య‌టించారు.

న‌ల‌గ‌ట్ల ల‌క్ష్మ‌ణ ‌స్వామి టీడీపీ నాయ‌కులు మ‌రియు జైన్లు, మర్వాడీలు భారీగా మంత్రి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వ‌నించారు. పార్టీలో చేరిన వారిలో హ‌రిష్ జైన్‌, ప్ర‌వీణ్ జైన్‌ మిధున్‌, సురేష్‌, బాబులాల్ జైన్‌ సుప్ర‌జ్ జైన్‌, మోహ‌న్ లాల్ జైన్‌, భార‌త్ బులెచ‌, మ‌హేంద్ర‌జైన్‌, వీన‌ష్ జైన్‌, సంప‌త్ జైన్‌, సుప్ర‌త్ జైన్ త‌దిత‌రులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

More Press Releases