మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన సీఎం కేసీఆర్

Related image

  • అభినందించిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు
  • సీఎం గారి ప్రశంసలు నా శాఖల అధికారులు, ప్రతి ఉద్యోగికి చెందుతాయి
  • సీఎం గారి ప్రశంసలు నాపై, నా శాఖల అధికారులు, ఉద్యోగులపై బాధ్యతను మరింత పెంచాయి
  • ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి మంచి పేరు తెచ్చేలా మరింత జాగ్రత్తగా పని చేస్తాను
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఈ రోజు మరోసారి అభినందించారు. గతంలోనూ పలు సందర్భాలలో ఇలా అభినందించారు. శాఖ పనితీరు బాగుందని ప్రశంసించారు. పల్లె ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. ఇలా దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగడం లేదని చెప్పారు. ఇది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనితీరుకు, సాధిస్తున్న ప్రగతికి నిదర్శనం. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహిస్తున్న శాఖలు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలకు జాతీయ స్థాయిలోనూ, అవార్డులు, ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. గతంలో స్వచ్ఛ అవార్డులు, ఉత్తమ పంచాయతీ, మండలం, జిల్లా అవార్డులు, మిషన్ భగీరథకు కూడా అనేక అవార్డులు వచ్చాయి. ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ అవార్డులు, ప్రశంసలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన శాఖలను సమర్ధంగా నిర్వహిస్తున్న తీరుకు మచ్చుతునకలు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనను ప్రశంసించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎంకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సీఎం ప్రశంసలు తనతో పాటు పని చేస్తున్న తన శాఖల అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, అటెండర్లు, స్విపర్లు అన్ని స్థాయిల ఉద్యోగులకు కూడా చెందుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు తన బాధ్యతను మరింత పెంచాయి అనీ, మరింత జాగ్రత్తగా, బాధ్యతగా, తన శాఖలను నిర్వహిస్తూ, సీఎం కేసీఆర్ కి, ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తామని తెలిపారు.

మంత్రికి వృక్ష వేదం పుస్తకాన్ని అందించిన ఎంపీ సంతోష్ కుమార్:
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ వృక్ష వేదం పుస్తకాన్ని సోమవారం అందించారు. ప్రగతి భవన్ లో పంచాయతీరాజ్ విభాగంపై జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రగతి భవన్ వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఎంపీ సంతోష్ ఈ పుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో దేశంలోనే అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్నారని, ఇదే కోవలో ఎంపీ సంతోష్, సీఎం గారి ని అనుసరిస్తూ, గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్త కార్యక్రమంగా మారిందని అనేక మంది ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ, మరికొందరికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ, మొక్కలు నాటుతూ పర్యా వరణానికి పాటు పడుతున్నారని మంత్రి అన్నారు. అలాగే మొక్కలు, వాటి విలువ, వేదాల్లో ఉన్న వాటి ప్రాశస్త్యం నేటి ప్రజలకు అందే విధంగా రూపొందించిన వృక్ష వేదం అద్భుత గ్రంథం అని అభినందించారు.

More Press Releases