మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ప్రారంభించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

Related image

విజయవాడ: మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుండి మధ్యప్రదేశ్ వరకు ఈ శ్రామిక రైలు వెళ్లనుంది.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్:

  • లాక్ డౌన్ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు
  • శ్రామిక రైలు ద్వారా వలస కార్మికులను వారి  స్వస్థలాలకు తరలింపు
  • లాక్ డౌన్ కారణంగా యాభై రోజులుగా పనులు లేక పస్తులు ఉంటున్న కార్మికులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన కార్మికులు
  • లాక్ డౌఙ్ వలస కూలీలు దేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడ్డారు
  • సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు‌ చేయాలని ఆదేశించారు
  • నడిచి వెళుతున్న కార్మికులకు ఆహారం, మంచినీరు సదుపాయం కల్పించాం
  • అందరూ బస్సు, రైళ్లల్లో‌ వెళ్లేలా చూడాలని సిఎం ఆదేశించారు
  • నేడు ఎంతో మంది తమ‌ స్వస్థలాలకు ఆనందంగా వెళుతున్నారు
  • సిఎం‌ చేసిన సాయం చూసి.. అభినందనలు తెలుపుతున్నారు
  • ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి
  • ఇప్పటి వరకు 12 రైళ్లు, 143 బస్సులు లను జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలకు పంపాం
  • ఇంత చేస్తున్నా ప్రతితిపక్షాలు రాజకీయం‌ చేస్తున్నాయి
  • ప్రభుత్వం చేస్తున్న పనులకు అభినందనలు తెలపకపోయినా పరవాలేదు.. అడ్డంకులు కల్పించవద్దు
  • చంద్రబాబునాయుడు జూమ్ వీడియోల ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు
  • రాయనపాడు వచ్చి చూస్తే.. వారికి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది
  • పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లు కాదు.. వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు
  • వామపక్ష పార్టీలు కూడా టిడిపి తోక పార్టీ లుగా మారిపోయారు
  • పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. ఇక్కడ రాజకీయం చేస్తున్నారు
  • ప్రతి కార్మికుడు కష్టపడకుండా సొంత ప్రాంతాలకు చేరేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది
  • ఎవరూ నడిచి వెళ్లకుండా అధికారులను సంప్రదించి రైళ్లల్లో‌ వెళ్లేలా పేర్లు నమోదు చేసుకోవాలి

More Press Releases