Telangana: తెలంగాణలో కొత్తగా 869 కరోనా కేసుల నమోదు

  • 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 13,052
  • కరోనా రికవరీ రేటు 97.32 శాతం
Telangana registers 869 new Corona cases

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 869 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు 1,197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 6,24,379కి చేరుకుంది. ఇప్పటి వరకు 6,07,658 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 1,05,123 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు.  

.

More Telugu News