Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 30 కొత్త కేసుల నమోదు
  • కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులు
AP register 30 new Corona cases in 24 hours

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ తగ్గుతోంది.  కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,834 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు. 69 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,88,899కి పెరిగింది. 8,81,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,163 మంది కరోనా వల్ల మృతి చెందారు.

More Telugu News