Andhra Pradesh: ఏపీలో మరో 379 కరోనా కేసుల నమోదు

  • 24 గంటల్లో ముగ్గురు వ్యక్తుల మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 3,864 యాక్టివ్ కేసులు
  • 8,79,718కి చేరుకున్న మొత్తం కేసులు
AP registers 379 new Corona Cases

ఏపీలో గత 24 గంటల్లో 57,716 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 379 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. 24 గంటల్లో 490 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,864 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,79,718కి పెరిగింది. మొత్తం మరణాలు 7,085కి చేరుకున్నాయి. 8,68,769 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,14,15,246 శాంపిల్స్ ని పరీక్షించారు.

More Telugu News