Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 402 కరోనా కేసులు

  • 24 గంటల్లో కరోనా వల్ల నలుగురి మృతి
  • కరోనా నుంచి కోలుకున్న వారు 412 మంది
  • ప్రస్తుతం రాష్ట్రంలో 3,978 యాక్టివ్ కేసులు
AP registers 402 new Corona cases

ఏపీలో గత 24 గంటల్లో 56,425 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 402 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 86, కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 24 గంటల్లో 412 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,79,339కి పెరిగింది. 7,082 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,68,279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,978 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

More Telugu News