jhansi: నా గురించి వస్తోన్న ఆ వార్తలు నమ్మొద్దు: యాంకర్ ఝాన్సీ

  • ఝాన్సీకి కరోనా వైరస్‌ సోకిందని నకిలీ వార్తలు
  • ఖండించిన యాంకర్‌
  • తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని వ్యాఖ్య
  • తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు
jhansi gives clarity on fake news

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంటే మరోవైపు ఫేక్‌న్యూస్‌ కూడా అంతకంతకు వ్యాప్తి చెందుతోంది. సెలబ్రిటీలకు కరోనా సోకిందని నకిలీ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సినీ, టీవీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కొందరికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అదునుగా చూసుకుని కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని ఇటీవల ప్రచారం జరిగింది.

తాను హోస్ట్‌గా ఉన్న పరివార్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించి స్పష్టతనిచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, షూటింగుల్లో పాల్గొంటోన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

More Telugu News