Venkatesh: 'ఎఫ్ 3' విషయంలో వెంకీ తాజా నిర్ణయం!

  • 'ఎఫ్ 2'కి సీక్వెల్ ప్లాన్ చేసిన అనిల్ 
  • వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 3'
  • లాక్ డౌన్ వల్ల 'నారప్ప' ఆలస్యం 
  • ఇక వచ్చే ఏడాదే సీక్వెల్ షూటింగ్  
Venkatesh joins F 3 film next year

'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ సినిమా చేసిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా 'ఎఫ్ 3' చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన హిట్ చిత్రం 'ఎఫ్ 2'కి ఇది సీక్వెల్. గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని నిర్వహిస్తున్నారు. పూర్తి స్క్రిప్టును కూడా దర్శకుడు ఇప్పటికే సిద్ధం చేశాడు. ప్రస్తుతం వెంకటేశ్ చేస్తున్న 'నారప్ప' చిత్రం తర్వాత దీనిని సెట్స్ కి తీసుకు వెళదామని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడీ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టుగా వార్తలొస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇప్పుడీ చిత్రం షూటింగ్ ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ, వెంకటేశ్ మాత్రం అప్పుడే షూటింగులో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది. రెండు మూడు నెలల తర్వాతే ఆయన 'నారప్ప' షూటింగ్ లో జాయిన్ అవుతారని, అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో 'ఎఫ్ 3' చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయించుకున్నారట. మరి, ఈ గ్యాప్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మరో చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి!

More Telugu News