JDU: బహిరంగ సభలో కాళ్లు పట్టించుకున్న జేడీయూ ఎమ్మెల్యే

  • బీహార్ లోని పాట్నాలో అనుచరులతో కాళ్లు పట్టించుకున్న ఎమ్మెల్యే కౌషల్ యాదవ్
  • ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ నిర్వహిస్తున్న సభలోనే ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
jdu legislator gets leg massage by partymen at a rally

బీహార్ లోని పాట్నాలో జరిగిన ఓ బహిరంగ సభలో జేడీయూ ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ పార్టీ కార్యకర్తలతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ గా మారింది. ఆ రాష్ట్ర సీఏం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఇలా చేయడం చర్చనీయాంశమైంది.

సభ ఆవరణలో..

బీహార్ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జేడీయూ తరఫున నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నవాడా నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ సభా ప్రాంగణంలో కార్పెట్ పై కూర్చుున్నారు. కొంత సేపటి తర్వాత ఆయన అలసిపోయానంటూ ఓ కార్యకర్త ఒడిలో తలపెట్టుకుని అలాగే కార్పెట్ పై పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయన కాళ్లు పట్టారు. మసాజ్ చేశారు.

జనం మధ్యలోనే..

అంత మంది జనం మధ్యలో ఓ ఎమ్మెల్యే ఇలా కార్యకర్తలతో కాళ్లు పట్టించుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని జాతీయ ఆంగ్ల మీడియా కూడా ప్రసారం చేసింది.

More Telugu News