Ranga Reddy District: హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌ పై నుంచి దూకి ఆత్మహత్య

  • ఎల్బీనగర్‌లో ఘటన
  • కుటుంబ కలహాలే కారణం
  • కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన పోలీసులు 
man jumps from flyover

ఓ వ్యక్తి ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత‌్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలిపారు. గత అర్ధరాత్రి  ఫ్లైఓవర్‌ పైకి ఎక్కి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం, లోయపల్లికి చెందిన నరేందర్‌ గౌడ్‌ కిందకు దూకేశాడని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుత్రికి తరలించినట్లు చెప్పారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వివరించారు. నరేందర్ గౌడ్ ఆత్మహత్యకు కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడికి జీవితంపై విరక్తి వచ్చిందని, ఈ ఘటనకు పాల్పడ్డాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News