Chiranjeevi: నిన్నటి సాయంత్రాన్ని నా జీవితంలో మర్చిపోలేను: రామ్ చరణ్

  • 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు
  • బుక్ విడుదల కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు
  • బుక్ ను లాంచ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న రామ్ చరణ్
It was a memorable evening yesterday saya Ram Charan

చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రచించిన 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకాన్ని నిన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

'నిన్నటి సాయంత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. చిరంజీవిగారి మీద పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. నాన్న సినీ ప్రయాణంలో కలిసి పయనించిన ఎందరో ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు' అని రామ్ చరణ్ తెలిపాడు.

More Telugu News