Guntur District: గుంటూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం... క్వారీ గుంతలో బోల్తా పడిన మిర్చి లారీ

  • శ్రీరాంపురం తండా వద్ద ఘటన
  • మిర్చి లోడుతో ప్రయాణిస్తున్న రైతులు
  • క్వారీ గుంతలో పడిపోయిన లారీ
Another road accident in Guntur district

గుంటూరు జిల్లాలో ఇవాళ వరుస ప్రమాదాలు సంభవించాయి. పుల్లడిగుంట వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో దారుణం చోటుచేసుకుంది. శ్రీరాంపురం తండా వద్ద ఓ మిర్చి లారీ క్వారీ గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బోధిలవీడు గ్రామానికి చెందిన రైతులు మిర్చి లోడుతో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

More Telugu News