Kanna Lakshminarayana: సీఎం జగన్​ కు బీజేపీ నేత కన్నా లేఖ

  • వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు, పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వాలి
  • జీతాలు రాక వారు ఇబ్బంది పడుతున్నారు
  • విధులకు దూరమైతే వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్న కన్నా
AP BJP President Kanna writes a letter to CM Jagan

వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు, పోలీసులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాసిన ఓ లేఖలో ఆయన విజ్ఙప్తి చేశారు. వెయింటింగ్ లో ఉన్న వారికి జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 80 మంది డీఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 150 మంది ఎస్ఐలు, 120 మంది సీఐలు పోస్టింగ్స్ లేకుండా ఉన్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంత మంది పోలీస్ అధికారులను విధులకు దూరంగా ఉంచడం వల్ల వారికి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, శాంతిభద్రతలకూ ఇబ్బందేనని అభిప్రాయపడ్డారు.

More Telugu News