Tirumala: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల!

  • వారాంతం కావడంతో రద్దీ
  • దర్శనానికి 8 గంటల సమయం
  • నిన్న స్వామిని దర్శించిన 80 వేల మంది
Heavy Rush in Tirumala

వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వీరికి దర్శనానికి 8 నుంచి 10 గంటల వరకూ సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, దివ్య దర్శనం టోకెన్ల భక్తులకు 4 గంటల్లో, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 3 కోట్లకు పైగా ఆదాయం లభించిందని వివరించారు. కాగా, నేడు టీటీడీ బోర్డు సమావేశమై వార్షిక బడ్జెట్ కు ఆమోదం ముద్ర వేయనుంది.

More Telugu News