Jagan: అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం జగన్

  • ముస్లింకు పవిత్రస్థలంగా పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా
  • సీఎంను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన ముస్లిం మతగురువులు, ప్రతినిధులు
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్టు చేసిన ఏపీ సీఎంఓ
AP CM Jagan offers Chadar to Ajmer Sharif Darga

ముస్లింకు పవిత్రస్థలంగా పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఏపీ సీఎం జగన్ చాదర్ సమర్పించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు సీఎంను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి ఏపీ ప్రభుత్వం తరఫున పవిత్ర వస్త్రాలతో కూడిన చాదర్ ను జగన్ అందించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ సీఎంఓ ట్విట్టర్ లో వెల్లడించింది. సీఎం చాదర్ సమర్పిస్తున్న ఫొటోలను కూడా పోస్టు చేసింది.

More Telugu News