Director Shankar: ఆ క్రేన్ ఏదో నా మీద పడినా బాగుండేది: దర్శకుడు శంకర్ ట్వీట్

  • వారం రోజుల క్రితం ఘటన
  • క్రేన్ తెగిపడి ముగ్గురి మృతి
  • భావోద్వేగ ట్వీట్ చేసిన శంకర్
Director Shankar responds about Crane Accident

తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా సెట్లో ఇటీవల జరిగిన ప్రమాదంపై ఆ చిత్ర దర్శకుడు శంకర్ స్పందించాడు. ఆ ప్రమాదం ఏదో తనకు జరిగినా బాగుండేదంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. తానింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, సహాయ దర్శకుడు, ఇతర సిబ్బందిని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నాడు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నానని, ఆ క్రేన్ ఏదో తనపై పడినా బాగుండేదని అన్నాడు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పాడు.

గత బుధవారం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ‘భారతీయుడు-2’ సినిమా కోసం సెట్టింగ్ వేస్తున్న సమయంలో క్రేన్ తెగిపడి 150 అడుగుల పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో  శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు  (29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), ఆహార సరఫరాదారు చంద్రన్‌ మృతి చెందారు.

More Telugu News