Allu Arjun: సుకుమార్ తో కలిసి కేరళ అడవులకు బన్నీ

  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • ద్విపాత్రాభినయం చేయనున్న బన్నీ 
  • కథానాయికగా రష్మిక మందన
Sukumar Movie

కొన్ని రోజులుగా బన్నీ 'అల వైకుంఠపురములో' సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొంత గ్యాప్ తరువాత బన్నీ ఖాతాలో సరైన హిట్ పడటం పట్ల ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం కేరళ అడవులకు వెళ్లడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎర్ర చందనం రహస్య రవాణ నేపథ్యంలో నడవనుంది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఈ కథ చిత్తూరు అడవి నేపథ్యంలో నడుస్తుంది. అయితే కొన్ని కారణాల వలన సంబంధిత సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు. మార్చి 13వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో రాయలసీమ యాసలో బన్నీ మాట్లాడనుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News