Pavan Kalyan: పవన్ సరసన మళ్లీ ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేశ్

  • చారిత్రక నేపథ్యంలో 'విరూపాక్ష'
  • బందిపోటు దొంగగా పవన్ కల్యాణ్
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
Krish Movie

పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని వెంటనే ఆచరణలో పెట్టడం కోసం దూకుడు మీదే ముందుకు వెళుతుంటాడు. పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడా? లేదా ? అనే సందేహంతో అభిమానులు సతమతమవుతుండగా, సినిమాల్లోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో చేస్తూనే, క్రిష్ దర్శకత్వంలోను సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. కీర్తి సురేశ్ గతంలో పవన్ సరసన 'అజ్ఞాతవాసి' చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన, ఈ కాంబినేషన్ జనానికి ఎక్కలేదు. పవన్ రీ ఎంట్రీ వేళలో మళ్లీ కీర్తి సురేశ్ ను వెతుకుతూ అవకాశం వెళ్లడం ఆమె అదృష్టమే. ఈ సారి ఈ జోడీ తెరపై ఒక రేంజ్ లో సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బందిపోటు దొంగగా పవన్ కనిపించనున్న ఈ సినిమాకి, 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

More Telugu News