Prabhas: 'మహానటి' దర్శకుడితో ప్రభాస్ మూవీ

  • పునర్జన్మల నేపథ్యంలో సాగే 'రాధే శ్యామ్'
  • ప్రభాస్ ను ఒప్పించిన నాగ్ అశ్విన్ 
  • త్వరలో రానున్న ప్రకటన 
Nag Ashwin Movie

ప్రస్తుతం ప్రభాస్ .. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'రాధే శ్యామ్' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇద్దరు .. ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఆ పేర్ల సంగతి అటుంచితే, తాజాగా నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది. 'మహానటి' సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్, అప్పటి నుంచి ఒక కథపై కసరత్తు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన ఆ కథను ప్రభాస్ కి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. తాజాగా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. అందువలన ఈ సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను ప్రకటించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని అంటున్నారు.

More Telugu News