Warangal Rural District: ఇన్నోవాలో వేగంగా వెళుతూ బైకును ఢీకొట్టిన పోలీసులు.. దంపతుల మృతి.. కుమార్తె పరిస్థితి విషమం!

  • వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘటన
  • రాయపర్తి మండలం తిర్మలయ్యపల్లి మీదుగా వెళ్తున్న దంపతులు
  • బైకును ఢీ కొట్టిన పాలకుర్తి సీఐ ఇన్నోవా 
road accident in warangal

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ పోలీసుల వాహనం దంపతుల ప్రాణాలు తీసింది. ఈ ప్రమాదంలో ఆ దంపతుల కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాయపర్తి మండలం తిర్మలయ్యపల్లి మీదుగా ఆ కుటుంబం వెళుతోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిర్మలయ్యపల్లి నుంచి బైకుపై ఆ కుటుంబం వెళ్తున్న సమయంలో అదే రోడ్డు మీదుగా  పాలకుర్తి సీఐ ఇన్నోవా వాహనంలో వెళ్తున్నారు. ఆ వాహనం వేగంగా రావడంతో ఒక్కసారిగా బైకును ఢీకొట్టింది.

దీంతో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయాలపాలైన వారి కుమార్తెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News