Vijayasai Reddy: చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారు: విజయసాయిరెడ్డి

  • రాజధాని తరలించొద్దన్న పిలుపుతో ఏదో అయిపోతుందనుకున్నారు
  • దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు
  • దీంతో ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారు
Ysrcp mp vijayasai reddy comments on chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు.


More Telugu News