Donald Trump: ఆగ్రాకు బయలుదేరిన ట్రంప్​ దంపతులు

  • పర్యటనలో భాగంగా ఆగ్రాకు ట్రంప్
  • తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్ దంపతులు
  • ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరిక 
Donanld Triump family leave to Agra

అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు ముగిశాయి. అనంతరం, తన పర్యటనలో భాగంగా ట్రంప్ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించేందుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్ మహల్ ను ట్రంప్ దంపతులు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కాగా, మోదీ రాక సందర్భంగా ఆగ్రా పట్టణాన్ని, తాజ్ మహల్ పరిసరాలను సుందరంగా అలంకరించారు.

More Telugu News