Crime News: మహిళా ఎస్సై పట్ల పూజారి అసభ్య ప్రవర్తన

  • వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎస్సై

వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో పూజారి సందీప్‌ శర్మ అలజడి రేపారు.  గుడిలోనే మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివరాత్రి సందర్భంగా మహిళా ఎస్సై గుడికి వచ్చింది. ఆ సమయంలోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఐ స్థానిక  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

More Telugu News