Hyderabad: హైదరాబాద్ లో బీభత్సం సృష్టించి పరారైన యువకులు!

  • బంజారాహిల్స్ లో గత రాత్రి ప్రమాదం
  • అతి వేగంతో వస్తూ ఫుట్ పాత్ ను ఢీకొన్న కారు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
Car Accident in Hyderabad

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలో గత రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు అతి వేగంగా వస్తున్న ఓ కారు రాయల్ టిఫిన్ సెంటర్ ముందు డివైడర్ ను ఢీకొని, దాదాపు మూడు అడుగుల ఎత్తున గోడెక్కింది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడంతో కారులోని వారికి ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం. ఆ వెంటనే కారులోని యువకులు పరారయ్యారు. దారిన వెళ్లే వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా అది ఎవరిదన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని, కారులోని యువకులు మద్యం మత్తులో ఉండి వుండవచ్చని అనుమానిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News