RSS: ఆర్ఎస్ఎస్ స్కూళ్లలో 12 వేల మంది ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థులు
- విద్యా భారతి, శిశుమందిర్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్
- వాటిలో క్రిస్టియన్లు కూడా పెద్ద సంఖ్యలోచదువుతున్నారు.
- యూపీలోని ఈ స్కూళ్లలో హిందుయేతర స్టూడెంట్లు 12వేల మందికిపైగానే..
- ఏటా మరింతగా పెరుగుతున్నారన్న నిర్వాహకులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యా భారతి పేరిట నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం స్టూడెంట్లు చదువుతున్నారు. కొందరు క్రిస్టియన్లు కూడా ఈ స్కూళ్లలో చదువుతున్నారు. అంతేకాదు ఏటా వారి సంఖ్య ఇంకా పెరుగుతోందని, గత మూడేళ్లలోనే 30 శాతం పెరిగిందని విద్యా సంస్థల నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు విద్యా భారతి స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం టీచర్లు కూడా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.