Mukhteswaralayam: తూ.గో.లోని ముక్తేశ్వరాలయం దగ్గర అన్యమత ప్రచారం!

  • ప్రముఖ శైవ క్షేత్రం ముక్తేశ్వరాలయం
  • ఆలయ ముఖ ద్వారం ఏసు ప్రభు పొటోల అమ్మకాలు
  • అధికారులు పట్టించుకోవడం లేదని భక్తుల ఆరోపణ

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని ముక్తేశ్వరాలయం దగ్గర అన్యమత ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. ఆలయ ముఖద్వారం ఎదుట ఏసు ప్రభు ఫొటోలను విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు నిండిపోయాయి.

More Telugu News