Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు బంద్

  • 29 గ్రామాలకు బంద్ పిలుపునిచ్చిన జేఏసీ
  • విద్యా, వ్యాపార సంస్థలు మూసివేయాలని సూచన
  • పోలీసుల తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్టు వెల్లడి
Amaravathi JAC calls for Bandh

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని గత కొన్నివారాలుగా రైతులు దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ రేపు బంద్ కు పిలుపునిచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో విద్య, వ్యాపార సంస్థలు మూసివేయాలని జేఏసీ సూచించింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్టు వెల్లడించింది.

More Telugu News