Narendra Modi: మోదీ ఢిల్లీలో 'లిట్టి చోఖా' తింటే.. బిహార్ లో కడుపు మండుతోంది: ఆర్జేడీకి బీజేపీ కౌంటర్
- మోదీ బిహార్ కు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేమంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్లు
- ప్రతిగా మోదీ లిట్టి చోఖా తింటే.. వీరికి కడుపు మండుతోందంటూ బీజేపీ విమర్శలు
- త్వరలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండటంతో క్రియాశీలకంగా మారిన పార్టీలు
ఇటీవల ఢిల్లీలోని హస్త కళా ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ 'లిట్టి చోఖా' తిన్న అంశం బిహార్ లో మంటలు రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, ప్రతిపక్షం ఆర్జేడీ మధ్య విమర్శల వార్ నడుస్తోంది. తొలుత మోదీ చేసిన పనిని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ట్వీట్లు చేశారు. “మీరు మా ప్రత్యేక వంటకం లిట్టీ చోఖా తినొచ్చు.. కానీ మీరు మాకు చేసిన ద్రోహాన్ని బిహార్ ఎప్పటికీ మర్చిపోదు” అని విమర్శించారు.