EURO 6: ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్, డీజిల్

  • బీఎస్-6 ఇంధనంతో తగ్గనున్న కాలుష్యం
  • ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిన రిఫైనరీలు
  • స్టోరేజ్ డిపోలకు చేరుతున్న ఇంధనం
India To Switch To Worlds Cleanest Petrol and Diesel From April 1

ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి యూరో-6 (బీఎస్-6) గ్రేడ్ పెట్రోల్, డీజిల్ మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్నాం. కేవలం మూడేళ్ల కాలంలోనే భారత్ ఈ మేరకు పురోగతిని సాధించడం గమనార్హం.

ఇంత తక్కువ కాలంలో ఈ ఫీట్ ను ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశమూ సాధించలేదు. యూరో-4 నుంచి యూరో-5కి అప్ గ్రేడ్ కాకుండానే... భారత్ నేరుగా యూరో-6 కి అప్ గ్రేడ్ అవుతుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.

ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని... ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్ తో మార్చబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయని... దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు.

More Telugu News