Samantha: ఏడాదిగా కష్టపడుతున్నాం.. ఇప్పుడు సాధ్యమైంది: స‌మంత‌ భావోద్వేగభరిత పోస్ట్

  • ప్రీ స్కూల్ బిజినెస్‌ ను ప్రారంభించ‌నున్న సమంత 
  • శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి స్కూల్ 
  • పేరు ఏకం లెర్నింగ్ సెంటర్‌  
  • హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఈ నెల 22న ప్రారంభం
samanta going to launch school

సినీ నటి స‌మంత ప్రీ స్కూల్ బిజినెస్‌ ప్రారంభించ‌నుంది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని తెలుపుతూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి ఆమె ఈ స్కూల్ ప్రారంభిస్తుంది.

దీనికి ఏకం లెర్నింగ్ సెంటర్‌ అని పేరు పెట్టింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఈ నెల 22న ప్రీ స్కూల్ ఏకం లెర్నింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని ఆమె తెలిపింది. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ స్కూల్‌ ప్రారంభించడం కోసం తాము ఏడాదిగా కష్టపడుతున్నామని, చివరకు ప్రారంభమవుతోందని భావోద్వేగభరితంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామని చెప్పింది.

More Telugu News