Jagan: కంటి వెలుగు కార్యక్రమంలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

  • కర్నూలులో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం
  • హాజరైన సీఎం జగన్
  • తమది ప్రజల ప్రభుత్వం అంటూ పునరుద్ఘాటన
  • చంద్రబాబుపైనా సెటైర్లు
CM Jagan  satires on Chandrababu Naidu

ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలులో మూడో విడత కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. తాము చేస్తున్న సంక్షేమం చూసి కొందరు అసూయపడుతున్నారంటూ, దేనికైనా మందు ఉంటుందేమో కానీ అసూయమంటలకు మందు ఉండదని విపక్ష నేత చంద్రబాబుపైనా సెటైర్లు వేశారు..  ఏ మంటకైనా చికిత్స ఉంటుందేమో కానీ కడుపుమంటకు చికిత్స లేదని, కంటికి సమస్యలు వస్తే నయం చేయవచ్చని, కానీ చెడుదృష్టిని నయం చేయలేమని అన్నారు. వయసు మళ్లితే ఫర్వాలేదని, మెదడు కుళ్లితే కష్టమని వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News