Nithin: 'భీష్మ' కథను మలుపుతిప్పే పాత్రలో హెబ్బా పటేల్

  • వెంకీ కుడుముల నుంచి 'భీష్మ'
  • నితిన్ జోడీగా రష్మిక మందన్న  
  • ఈ నెల 21వ తేదీన విడుదల  
Bheeshma Movie

నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ కుడుముల 'భీష్మ' సినిమాను రూపొందించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించగా, మరో కథానాయికగా హెబ్బా పటేల్ కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? అనే ఆసక్తి యూత్ లో నెలకొంది. ఈ సినిమాలో ఆమె ఏదో సాదా సీదా పాత్రలో కనిపించడం లేదట. కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'కుమారి 21F' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఒకటి రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో రేస్ లో వెనుకబడిపోయింది. 'భీష్మ' సినిమా మళ్లీ ఆమెను నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News