Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను 'పిచ్చికుక్క' అన్న ఎమ్మెల్యే జోగి రమేశ్‌.. జనసేన ఆగ్రహం

  • నిరసన ప్రదర్శనకు సిద్ధమైన జనసేన నేతలు
  • జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న జనసేన నేతలు
janasena leaders fires on jogi ramesh

నిన్న తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జోగి రమేశ్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పరుష పదజాలంతో విమర్శించారు. 'పీకే అంటే మీ భాషలో పవన్ కల్యాణ్ ఏమోగాని, నా భాషలో మాత్రం పిచ్చి కుక్క' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే  చూస్తూ ఊరుకోబోమని  జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ ఈ సందర్భంగా అన్నారు. నిరసన తెలియజేసే హక్కు తమకుందని, పోలీసులు ముందుగానే ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. జగన్‌లా తమ నాయకుడు పవన్ అవినీతి చేసి జైలుకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. సంస్కారం మరచి మాట్లాడటం పవన్ తమకు నేర్పలేదని చెప్పారు.

More Telugu News