BJP: హైదరాబాద్ లో త్వరలో బీజేపీ బహిరంగసభ.. హాజరుకానున్న అమిత్​ షా, పవన్ కల్యాణ్

  • సీఏఏకు మద్దతుగా బీజేపీ బహిరంగసభ
  • వచ్చే నెల 14న ఎల్బీ స్టేడియం వేదికగా సభ
  • ఏర్పాట్లు ప్రారంభించే పనిలో బీజేపీ శ్రేణులు
Amit sha and pawan kalyan will participate in  BJP Public meeting in Hyderabad

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. వచ్చే నెల 14న జరిగే ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించే ఈ సభలో అమిత్ షా, పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.  కాగా, ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News