Ch Malla Reddy: మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ హెచ్చార్సీని ఆశ్రయించిన మహిళ

  • భూ వివాదంలో మల్లారెడ్డి
  • తన భూమిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారంటూ మహిళ ఫిర్యాదు
  • అధికారులు కూడా మంత్రికే మద్దతు ఇస్తున్నారని ఆరోపణ
Woman moves to HRC and complains on minister Mallareddy

ఓ భూ వివాదంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పి.శ్యామలాదేవి అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేడ్చెల్ జిల్లా సూరారంలో తనకు చెందిన 33 కుంటల భూమిని మంత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి సూరారంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయని, ఆ ఆసుపత్రుల మధ్యలో తన స్థలం ఉండడంతో కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారులు సైతం మంత్రికే వత్తాసు పలుకుతున్నారని శ్యామలా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు.

More Telugu News