Akhil: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్

  • ముగింపు దశలో అఖిల్ 'బ్యాచ్ లర్'
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 
  •  ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి  
Surendar Reddy Movie

అఖిల్ నిదానంగానే కథలను ఎంచుకుంటున్నాడు .. నిదానంగానే సెట్స్ పైకి వెళుతున్నాడు. అయితే కథల విషయంలో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా, వాటి ఫలితం మాత్రం నిరాశ పరుస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే తదుపరి ప్రాజెక్టును అఖిల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దాంతో అఖిల్ కి కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News