Kukatpally: అమరావతి రైతులకు మద్దతుగా కూకట్ పల్లిలో సమావేశం.. అడ్డుకున్న పోలీసులు!

  • ఈ సమావేశానికి హాజరైన ఏపీ వాసులు
  • తమ అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల అదుపులో నిర్వాహకులు, మద్దతుదారులు 

అమరావతి రాజధానిని తరలించవద్దంటూ రైతులకు మద్దతుగా హైదరాబాద్ లోని ఏపీ వాసులు నిలిచారు. స్థానిక కూకట్ పల్లిలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని, నిర్వాహకులను, మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి తమ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కూకట్ పల్లి, వసంత్ నగర్ సహా పరిసర కాలనీల్లోని ఏపీ వాసులు ఈ సమావేశానికి మద్దతు తెలిపారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’, ‘కులం వద్దు..మతం వద్దు’, ‘రాజకీయాలు వద్దు.. రాజధాని ముద్దు’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబూనారు. అమరావతిని తరలించవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

More Telugu News