BJP: మూడు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

  • కేరళ, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లు
  • ఉత్తర్వులు జారీ చేసిన అధ్యక్షుడు జేపీ నడ్డా
  • మధ్యప్రదేశ్ చీఫ్‌గా విష్ణుదత్ శర్మ
JP Nadda apoint new chiefs to three states

ఢిల్లీ ఓటమి తర్వాత బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కిం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, జబల్‌పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ స్థానంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఖజురహో ఎంపీ విష్ణుదత్ శర్మను నియమించగా, సిక్కిం బీజేపీ చీఫ్‌గా దల్ బహదూర్ చౌహాన్‌ను నియమించింది. కేరళ అధ్యక్షుడిగా కె.సురేంద్రన్‌లను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News