Vijay Sai Reddy: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు 
  • నిప్పు కణికలు తనను చూసి ఈర్ష్యపడతాయని గొప్పలు పోయాడు
  • 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు 
  • వ్యవస్థలన్నిటినీ మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు 
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో విచ్చలవిడిగా దోచుకున్న చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకుంటూ వచ్చారని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.

'మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు. నిప్పు కణికలు నన్ను చూసి ఈర్ష్యపడతాయని గొప్పలు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నిటినీ మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

More Telugu News