Akash Puri: 'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఖరారు

  • ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం 
  • మే 29వ తేదీన విడుదల

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి కథానాయకుడిగా 'రొమాంటిక్' చిత్రం రూపొందుతోంది. పూరి - చార్మీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా కేతిక శర్మ పరిచయమవుతోంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మే 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఈ పోస్టర్ వుంది. సునీల్ కాశ్యప్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. హీరోగా ఆకాశ్ కి హిట్ పడాలనే పట్టుదలతో .. నిర్మాతగా కూడా తనని ఈ సినిమా నిలబెడుతుందనే ఆశతో పూరి వున్నాడు.

More Telugu News