Vijay Sai Reddy: ఎల్లో మీడియా రేపో, మాపో సిగ్గులేని రాతలు రాస్తుంది: విజయసాయిరెడ్డి

  • ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు
  • స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి
  • ఇక దుష్ప్రచారం మొదలుపెడతారంటూ విసుర్లు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏబీ సస్పెన్షన్ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అధికారులంతా గజగజావణికిపోతున్నారని, డిప్యుటేషన్ పై కేంద్రానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఎల్లో మీడియా రేపో, మాపో సిగ్గులేని రాతలు రాస్తుందని ట్వీట్ చేశారు. "నిప్పు నాయుడే అసూయపడేంత నిజాయతీపరుడ్ని సస్పెండ్ చేస్తారా?" అంటూ విషప్రచారం మొదలుపెడుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News