My homes: రాయదుర్గంలో భూ కేటాయింపులపై రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్

  • భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణ
  • నిబంధనలకు విరుద్ధంగా స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు
  • మైహోమ్స్ రామేశ్వర్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, డిఎల్ఎఫ్ సంస్థకు నోటీసులు

రంగారెడ్డి జిల్లా,  శేరిలింగం పల్లి, రాయదుర్గంలో  మైహోమ్స్ సంస్థకు భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. భూ కేటాయింపుల్లో నిబంధనలు తోసిరాజని వందలకోట్ల విలువైన భూములను ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా 38 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని తన పిటిషన్లో ఆరోపించారు. హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, మైం హోంమ్స్ అధినేత రామేశ్వర్ రావుకు, ప్రభుత్వానికి, డీఎల్ఎఫ్ సంస్థకు నోటీసులు జారీచేస్తూ.. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

More Telugu News