Chandrababu: ఇదంతా వైసీపీ నేతల తెలివి తక్కువతనం: చంద్రబాబు నాయుడు

  • నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్న నేతలు
  • ప్రజలు వైసీపీ నేతల మాటలను నమ్మబోరు
  • ట్విట్టర్ లో మాజీ సీఎం చంద్రబాబు

వైసీపీ నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడితే, ప్రజలు దాన్ని నమ్మబోరని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "ప్రజలను మభ్యపెడదామనో, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుందామనో, సమస్యలను పక్కదారి పట్టించడానికో నోటికొచ్చిందల్లా మాట్లాడితే జనం నమ్మేస్తారనుకోవడం వైసీపీ నేతల తెలివితక్కువతనం. రాష్ట్ర సమస్యల పట్ల వైసీపీ నేతల కన్నా ప్రజలకే మంచి అవగాహన ఉంది అని చెప్పడానికి ఈ యువతి అభిప్రాయాలే ఉదాహరణ" అని అన్నారు. ఈ ట్వీట్ కు ఓ యువతి జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న వీడియోను చంద్రబాబు జోడించారు. 

More Telugu News